కుంకుమపువ్వు చరిత్ర
కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఆకర్ణీయమైన సుగంధ ద్రవ్యం, అంతేకాదు అతి ఖరీదైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగినది కూడా. నాటి రాచరికకాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమపువ్వు . క్రీ.పూ. 500 సం. ముందే కుంకుమ పువ్వు ప్రస్తావం ఉన్నది . మనదేశంలో ఇది కేవలం కశ్మీర్ ప్రాంతంలో మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్, ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకీ కాశ్మీరీ కేసర్ నాణ్యమైనది. మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా 'కేసర్' అంటారు.
కుంకుమ పువ్వు సాగు
కుంకుమ పువ్వును ఇరాన్ దేశం అత్యధికంగా పండిస్తుంది. భారతదేశంలో కుంకుమ పువ్వుని కాశ్మీర్లో పండిస్తారు. వర్షాకాలం చివరలో కుంకుమ దుంపలను దున్నిన భూమిలో నాటుతారు. ఎండాకాలం ఆరంభానికి కోత కోస్తారు. కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ ఉండరాదు, మట్టి గుల్లగా ఉండాలి, అత్యధికంగా ప్రకృతిసిద్ధమైన ఎరువులు వాడాలి, వర్షపాతం తక్కువగా ఉండాలి. దుంప నాటిన రెండు నెలలకే పుష్పాలు పూస్తాయి. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది. కుంకుమ పువ్వును ఇంటివద్ద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కుండీ మట్టిలో కొబ్బరి పొట్టు, వానపాముల ఎరువు సమానభాగాలుగా ఉండాలి. కుంకుమపువ్వు మొక్కలను పూర్తి ఎండలోగాని, పాక్షిక ఎండలోగాని పెంచుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో అయితే చలి ఎక్కువ ఉండే మెట్టప్రాంతాల్లో పండిచవచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో కుంకుమ పువ్వు దుంపలను అక్టోబరు నెలలో నాటితే మంచిది. ఒక్క గ్రాము కాశ్మీర్ కుంకుమ పువ్వు కేసరాలు రూ. 300నుండి రూ.500 వరకూ ధర పలుకుతుంది.
పెరుగుతుందిలా...
కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్లో పండించే కుంకుమపువ్వు మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు. కేవలం వంగపండురంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు - నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు. ఈ ఎరుపురంగు భాగమే ఘాటైన వాసననీ రుచినీ రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నింటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటి నుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మన దగ్గర గ్రాము కుంకుమపువ్వు ధర సుమారు రూ.60 నుంచి 600 వరకూ ఉంటుంది. నాణ్యతనుబట్టి ధర మారుతుంది. మనిషి వాడిన మొదటి సుగంధద్రవ్యం ఇదేనట. సుగంధద్రవ్యాల్లోకెల్లా
కుంకుమ పువ్వు ఉపయోగాలు
కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు. కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది. ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది. కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. మంచి రంగూరుచీవాసనా ఉన్న అరుదైన సుగంధద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది దీన్ని అందరూ ‘ఎర్ర బంగారం’ అని పరిగణిస్తారు.
కంటికిమేలు చేస్తుంది
కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి. ఇంట్లో గర్భిణి ఉంటే కుటుంబసభ్యులు కుంకుమ పువ్వును కొనితెస్తారు. ఇదే కాదు, అదనపు రంగు కోసం దీన్నివంటకాల్లోనూ వినియోగిస్తారు. ఈ రెండు ఉపయోగాలు అందరికీ తెలిసినవే. తెలియనిది మరొకటుంది. ఏంటంటే, దానివల్ల కంటికి చాలా మేలు. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ కంటి చూపు తగ్గుతుంది. కంకుమ పువ్వులో దీనినిమెరుగుపరిచే కారకాలున్నాయి. అందుకే యాభైకి పైబడుతున్న వారంతా తరచూ ఆహారంలో కుంకుమపువ్వునుతీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
వైద్య పరంగా కుంకుమ పువ్వు ఉపయోగాలు
కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు.ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్మిటర్లను, డోపమైన్ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్ను నివారించే కీమో-ప్రివెంటివ్ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది . గర్భిణులు మొదటి నెలనుండీ కుంకుమపువ్వు వాడవచ్చును ... కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు ఉంటాయి కాబట్టి ... అనుకూలత బట్టి వాడాలి . తేనె, పాలు, పటికి పంచదార లతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును . కుంకుమ పువ్వుతో గాఢనిద్ర : రాత్రివేళ ఆహారములోనో, ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది . నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలము నాడే గుర్తించారు . ధనవంతులైన రోమన్లు గా్ఢముగా నిద్రించేందుకు గాను తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట .
రసాయనాలు, పోషక విలువలు
కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ వంటి గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు అనే రసాయనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వులో విటమిన్ ' ఎ ', ఫోలిక్ యాసిడ్, విటమిన్ ' సి ' ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇందులో శక్తి -15.5%, కార్బోహైడ్రేట్స్-50%, ప్రోటీన్స్ -21%, ఫ్యాట్స్ - 21%, విటమిన్స్ - 77%, మినరల్స్ - 37% ఉన్నాయి.