ఈ చికిత్స వలన ఆమము కరిగిపోయి విరేచనము అవుతుంది. అంతేకాక గర్భవాతము, కడుపునొప్పి, కఫప్రకోపము తగ్గిపోతాయి. ఆకలిపుడుతుంది. అయితే ఈ చికిత్సను తరచుగా చేయకూడదు. అతిగా చేస్తే నేత్రసంబంధ రోగములు వచ్చే ప్రమాదం ఉంటుంది. పైత్యము ప్రకోపించవచ్చు.
పసిపిల్లలకు కడుపుఉబ్బరము, కడుపునొప్పి, మలమూత్రములు బంధించిన సందర్భాల్లో తల్లులు వారిని కాళ్ళమీద వెలకిలా పడుకోబెట్టుకుని, తమ అరచేతులు నిప్పులపై కాచుకుని, వేడివేడి చేతులతో ఆ పిల్లల కడుపుకు కాపడము పెట్టాలి. దీనివల్ల బాధలు ఉపశమిస్తాయి.