- నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారమునందు ప్రతిదినము నియమపూర్వకంగా తినినచో జీవశక్తి, ఆయుర్దాయము పెరుగును.
- ప్రతిరోజూ వామురసము పుచ్చుకొనుచుంటే గుండెనొప్పి హరించును.
- రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతీ ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మపండ్ల రసం తీసుకుంటే రక్త వృద్ధి, శుద్ధి అగును.
- పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరువాత పట్టుతేనెలో నానబెట్టి 6 మాసములు ఊరిన తర్వాత రోజూ ఒకటి తినుచుండిన రక్తపోటు, హృదయకోశ వ్యాధులు దరిచేరవు. ఎంతటివారికైనా మంచి చురుకుదనము వచ్చు.
- బొల్లి నివారణకు బాదంచాల గింజల గంధము, ప్రతతాళక చూర్ణము కలిపి మచ్చలపై పూయాలి.
- మునగ ఆకు రసము, మునగ ఆకుతో వండిన వంటకములు తింటే రోగములు హరించును.
- ప్రతిదినము తేనె, అల్లపురసం కలిపి తాగిన రక్తశుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగును.
- తులసిఆకు పసరు, తేనె కలిపి త్రాగిన సర్వ కఫములు హరించును.
- దెబ్బలకు, పైనుండి పడుట వలస కలిగిన నొప్పులకు శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి.
- గుంటకన్నాకు, మిరియాలు నూరి మాత్రలు చేసి సేవించిన వాతావరణ మార్పులవల్ల వచ్చే జ్వరాలు తగ్గును.
- ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళాదుంపలు, తులసిఆకులు బీపీ తగ్గించును.
- రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి(నువ్వులతో చేసినది) తింటే మలబద్ధకం హరిస్తుంది.
- అల్లపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటివల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది.
- అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతిలో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది.
- గోరుచుట్టుకు పచ్చి పసుపుదుంప మెత్తగా నూరి వేలిపై పూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉండే బాధలు తగ్గి నయమగును.
- అరటిదూట రసం సర్వరోగ నివారిణి.
- మెంతులు, మెంతికూర ఎక్కువవాడిన చక్కెరవ్యాధి తగ్గును.
- తెలగపిండి ఆకు రసం రోజూ ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.
- వేడినీటిలో తేనె కలిపి తాగుతూ ఉండే స్థూలకాయం తగ్గుతుంది.
- కుంకుడుకాయ రసం(నురుగు) వెచ్చచేసి రెండు ముక్కుల్లోనూ వేస్తే పార్శ్వనొప్పి పోతుంది.
- నువ్వులనూనెను వెచ్చచేసి అందులో కర్పూరం కలిపి అరికాళ్ళకు మర్దనా చేస్తే సుఖ నిద్ర కలుగుతుంది.
- కోడిరెట్ట కుక్కకాటుపై పూసిన విషము హరించును.
- తెల్లవిష్ణుకాంత, నల్ల విష్ణుక్రాంత వేర్లను కలిపినూరి లేపనము చేసిన కుష్ఠువ్యాధి హరించును.
- చెంగల్వకోష్ఠు, మందారపువ్వులు నూనెయందు ఉడికించి రాసిన పేను కొరుకుడు తగ్గుతుంది.
- నల్లి రక్తం రాసిన పేనుకొరుకుడు తగ్గి జుట్టు వస్తుంది.
- మందారపువ్వులను కపిలగోవు మూత్రంతో నూరి తలకు పట్టించిన వెంట్రుకలు ఊడుగ ఆగి కొత్త వెంట్రుకలు పెరుగును.
- నేల ఉసిరికాయల పసరు మజ్జిగలో కలిపి తీసుకున్న పచ్చకామెర్లు తగ్గును.
- ముల్లంగి ఉదయాన్నే పటికిబెల్లంతో కలిపి తింటే పచ్చకామెర్లు తగ్గును. గసగసాల చూర్ణం రెండు చెమ్చాలు మొదటిముద్దలో తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి.
- ముడినువ్వులు, తాటిబెల్లం చిమ్మిలి చేసి తింటే షుగరు తగ్గుతుంది.
- కాకరాకు పసరు త్రాగితే కడుపులోని పురుగులు పోతాయి.
- జీలకర్ర నమిలి రసం మింగితే వికారం, వాంతులు తగ్గుతాయి.
- యాలకులు తింటే మూత్ర విసర్జన సమంగా జరుగుతుంది.
- రొంపభారమునకు పసుపు ఆవిరిపట్టిన తగ్గును. ఖాళీకడుపుతో ఆవిరిపట్టాలి.
- దాల్చినచెక్క రోజూ తింటే జ్ఞాపకశక్తి పెరుగును.
- మామిడి ఆకులు రోజూ నమిలితే నోటి వ్యాధులు తగ్గును.
- మాచికాయ గంధం రాస్తే నోటిపూత తగ్గును.
- మజ్జిగ అన్నంలో నీరుల్లి తింటే నరములకు సత్తువ కలుగును.
- ముల్లంగి దుంపపై ఉప్పు చల్లి తేలుకుట్టిన చోట పెడితే విషము హరించును.
- క్యారట్ రోజూ తింటే కంటి వ్యాధులు రావు.
- క్యాబేజీ తింటే కడుపులోని పుండ్లు తగ్గును. కంతి ఉంటే తగ్గును.
ఆరోగ్యంగా ఉండడానికి 40 చిట్కాలు
0
February 03, 2016